భారత్ కు బాసటగా విరాళాలు సేకరించనున్న కువైట్
- May 11, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వేరియంట్స్ తో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్న కువైట్ ప్రభుత్వం..ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ కు వీలైనంత సాయం
అందించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు పంపిన కువైట్..తమ స్నేహశీలతను చాటుకునేలా ఫండ్ రైజింగ్ ప్రొగ్రాం చేపట్టింది. ఈ మేరకు సాంఘిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 18న కోవిడ్ రిలీఫ్ ఫండ్ పేరుతో విరాళాలు సేకరించాలని నిర్ణయించింది.గత నెల 26న జరిగిన కేబినెట్ సమావేశ నిర్ణయాలకు అనుగుణంగా కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి తమకు విరాళాల సేకరణకు సంబంధించి లేఖ అందిందని సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యార్మౌక్లోని కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ హాల్లో ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి విరాళాల సేకరణ ప్రారంభం అవుతుందని వివరించింది. పలు స్వచ్ఛంద సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంతో పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించేలా కృషి చేస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









