భారత్ కరోనా అప్డేట్

- May 11, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.అయితే, నిన్నటి కంటే స్వల్పంగా కేసులు తగ్గాయి.తాజాగా దేశంలో 3,29,942 కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,92,517కి చేరింది.ఇందులో 1,90,27,304 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,15,221 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 3,876 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటివరకు కరోనాతో 2,49,992 మంది మృతి చెందారు.ఇక ఇదిలా ఉంటె గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 3,56,082 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.ఇకపోతే ఇప్పటి వరకు భారత్ లో 17,27,10,066 మందికి వ్యాక్సిన్ అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com