క్వారంటైన్ ఖర్చులు కలిపి టికెట్ ధరలు..ఎయిర్ లైన్స్ కు సౌదీ ఆదేశాలు
- May 11, 2021
సౌదీ: సౌదీ అరేబియా వచ్చే ప్రయాణికుల కోసం క్వారంటన్ నిబంధనల్లో సవరణలు ప్రకటించింది కింగ్డమ్ ప్రభుత్వం. ఇక నుంచి సౌదీ చేరుకునే ప్రయాణికులు అందరూ నిర్ణీత 7 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి, క్వారంటైన్ ఖర్చులు సదరు ఎయిర్ లైన్స్ భరించాల్సి ఉంటుంది. అయితే..క్వారంటైన్ కు అయ్యే ఖర్చును టికెట్ ధరలో జోడించి ప్రయాణికుల దగ్గర్నుంచి ముందస్తుగానే వసూలు చేసుకోవాలని కూడా కింగ్డమ్ పౌరవిమానయాన సంస్థ అధికారులు స్పష్టం చేశారు.అంటే..వ్యాక్సిన్ వేసుకోని వాళ్లందరూ టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే క్వారంటైన్ కు అయ్యే ఖర్చులను కూడా కలిపి చెల్లించాల్సి ఉంటుంది.దీంతో ప్రయాణికులను సౌదీకి తీసుకురావటంతో పాటు వారిని క్వారంటైన్ కు పంపే బాధ్యతను కూడా ఎయిర్ లైన్స్ బాధ్యత కిందకు తీసుకువచ్చింది జీఏసీఏ.ఈ మేరకు క్వారంటైన్ సౌకర్యాలను అందిస్తున్న పర్యాటక శాఖతో అవగాహన కుదర్చుకోవాలని కూడా జీఏసీఏ స్పష్టం చేసింది. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రం క్వారంటైన్ రూల్ వర్తించవు. వారికి ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు.ఇక సౌదీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల్లో 8 సంవత్సరాలకు పైబడిన వాళ్లందరూ కోవిడ్ నెగటీవ్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









