శ్రీలంక పై పాకిస్తాన్ విజయం
- March 04, 2016
ఆసియాకప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు ఉండగానే పాక్ లక్ష్యాన్ని ఛేరుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్ షార్జిల్ ఖాన్(24 బంతుల్లో 31), సర్ఫరాజ్ అహ్మద్ (27 బంతుల్లో 38), ఊమర్ అక్మల్(48: 4 ఫోర్లు, 2 సిక్సులు) రాణించడంతో పాక్ తన చివరి మ్యాచ్ లో గెలుపొందింది. ఊమర్ అక్మల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అయితే, ఈ జట్లు ఇప్పటికే ఇంటి దారి పట్టాయి. మార్చి 6న జరగనున్న ఫైనల్లో బంగ్లాదేశ్, భారత్ తలపడనున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







