భారత్ కు ట్విట్టర్ భారీ సహాయం

- May 11, 2021 , by Maagulf
భారత్ కు ట్విట్టర్ భారీ సహాయం

భారత్ లో కరోనా కట్టడి చర్యలకు ట్విట్టర్ సుమారు రూ.110 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దేశంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకుగాను పాటుపడుతున్న మూడు ఎన్జీవో సంస్థలకు ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే తెలిపారు.ఆక్సిజన్, పీపీ ఈ కిట్స్, మందుల కొనుగోలుకు కేర్,ఎయిడ్ ఇండియా,సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు.ఇందులో కేర్‌ ఎన్జీవోకు 10 మిలియన్‌ డాలర్లు కేటాయించగా..మిగతా రెండు సంస్థలకు 2.5 మిలియన్‌ డాలర్ల చొప్పున విరాళమిచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com