రుయా మృతలకు రూ.10 లక్షల పరిహారం
- May 11, 2021
తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక నిన్న రాత్రి 11 మంది మరణించిన సంగతి తెలిసిందే.కోవిడ్ ఆత్యవసర విభాగంలో ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కలగడంతో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు.ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందని..దీని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పటికే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇక తాజాగా..రుయా మృతలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు సిఎం జగన్. బాధిత కుటుంబాలకు అన్ని రకాల అండగా ఉంటామని సిఎం జగన్ హామీ ఇచ్చారు. అటు ఈ ఘటనతో ఆక్సిజన్ పై ఏపీ ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది.ముగ్గురు సీనియర్ అధికారులకు ఆక్సిజన్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలకు ముగ్గురు అధికారులను నియమించింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









