యూఏఈ: 7 వర్గాలకు వ్యాక్సిన్ నుంచి మినహాయింపు
- May 12, 2021
యూఏఈ: కోవిడ్ వ్యాక్సిన్ నుంచి 7 వర్గాలకు మినహాయింపు ఇచ్చింది యూఏఈ. ఈ మేరకు అబుధాబి అత్యవసర, విపత్తు నిర్వహణ కమిటీ సహకారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ ఏడు వర్గాలకు మినహాయింపు వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గర్భిణిలు, ఇతర దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నవారు, కోవిడ్ పేషెంట్లు, క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్నవారు, కోవిడ్ నుంచి కోలుకొని మెడికేషన్ లో ఉన్నవారు, తొలి డోసు వ్యాక్సిన్ సమయంలో అలర్జీలు వచ్చిన వారు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతూ వ్యాక్సిన్ తో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మినహాయింపు పత్రాలను పొందాలనుకునే వారు అబుధాబి ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి డాక్టర్లను సంప్రదించి మినహాయింపు పత్రం తీసుకోవాలి. మెడికల్ సెంటర్ ద్వారా అల్ హోస్న్ యాప్ లో మినహయింపు పత్రాన్ని అప్ డేట్ అవుతుందని అదికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దొంగిలించిన క్రెడిట్ కార్డుల కొనుగోలుపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్!
- ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు
- న్యూఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న వెంకయ్య నాయుడు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!









