యూఏఈ: 7 వర్గాలకు వ్యాక్సిన్ నుంచి మినహాయింపు
- May 12, 2021
యూఏఈ: కోవిడ్ వ్యాక్సిన్ నుంచి 7 వర్గాలకు మినహాయింపు ఇచ్చింది యూఏఈ. ఈ మేరకు అబుధాబి అత్యవసర, విపత్తు నిర్వహణ కమిటీ సహకారంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ ఏడు వర్గాలకు మినహాయింపు వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గర్భిణిలు, ఇతర దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నవారు, కోవిడ్ పేషెంట్లు, క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్నవారు, కోవిడ్ నుంచి కోలుకొని మెడికేషన్ లో ఉన్నవారు, తొలి డోసు వ్యాక్సిన్ సమయంలో అలర్జీలు వచ్చిన వారు, దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతూ వ్యాక్సిన్ తో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్న వారికి కోవిడ్ వ్యాక్సిన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మినహాయింపు పత్రాలను పొందాలనుకునే వారు అబుధాబి ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి డాక్టర్లను సంప్రదించి మినహాయింపు పత్రం తీసుకోవాలి. మెడికల్ సెంటర్ ద్వారా అల్ హోస్న్ యాప్ లో మినహయింపు పత్రాన్ని అప్ డేట్ అవుతుందని అదికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









