లాక్ డౌన్ కచ్చితంగా అమలు: సీపీ మహేష్ భగవత్
- May 12, 2021
హైదరాబాద్: నేటి ఉదయం 10 గంటల నుండి లాక్డౌన్ ఏర్పడిన నేపథ్యంలో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితిని ఉప్పల్, మేడిపల్లి, ఎల్బీ నగర్ పిఎస్ ల పరిధిలలోని చెక్ పోస్ట్ లను రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలించి పోలీసు సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్ లో మొత్తం 46చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది మూడు షిప్టులలో పనిచేయనున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేళల్లో లాక్ డౌన్ కచ్చితంగా అమలు చేస్తామని ఆయన అన్నారు.

లాక్ డౌన్ కి ప్రజలు పూర్తి సహకారం అందించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కోరారు. వ్యాపార సముదాయాలు ఉదయం పది గంటలకే మూసివేయాలని లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రైతు బజార్, రేషన్ దుకాణాలు, నిత్యావసర వస్తువుల దుకాణాలు, షాపింగ్ మాల్స్ కి గుంపులుగా వెళ్లకూడదని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రాచకొండ కోవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 9490617234 కు ఫోన్ చేయాలని సీపీ కోరారు.

తాజా వార్తలు
- క్యాన్సర్ను జయించి..మారథాన్ రన్నర్గా నిలిచిన 40 ఏళ్ల మహిళ
- ప్రతి నేతన్నకు ఉచిత విద్యుత్: మంత్రి సవిత
- బిగ్ అలర్ట్..10 రోజులపాటు తీవ్ర వడగాలులు
- వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం
- సెంట్రల్ మార్కెట్ లో రైడ్స్..మూడు కేసులు నమోదు..!!
- 'లుక్స్ మాక్సింగ్' ప్రయత్నించారా? సోషల్ మీడియా ట్రెండ్ పై హెచ్చరిస్తున్న డాక్టర్లు..!!
- బహ్రెయిన్ లో ఫుడ్ స్కామ్.. నిందితులకు జైలుశిక్ష, ఫైన్, బహిష్కరణ..!!
- సౌదీలో రోజుకు సుమారు 700,000 బ్యారెళ్ల ఉత్పత్తి నష్టం..!!
- కోరల్ రిఫ్ ప్రాజెక్టును ప్రారంభించిన ఎన్విరాన్ మెంట్ అథారిటీ..!!
- 2,818 ఆయుధాలు అప్పగించిన కువైటీలు..!!









