భారత్ కరోనా అప్డేట్

- May 13, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.రోజు రోజుకు దేశంలో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో నమోదయ్యాయి.ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు చేపట్టినా..ప్రభావం కనిపించడం లేదు.ఇక ఇదిలా ఉండే, దేశంలో కొత్త‌గా 3,62,727 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి.దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,37,03,665 కి చేరింది.ఇందులో 1,97,34,823  మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 37,10,525 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 4,120 మంది మృతి చెందారు.దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,58,317కి చేరింది.ఇక 24 గంటల్లో 3,52,181 మంది కరోనా నుంచి కోలుకోవడం శుభపరిణామం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com