భారత్ కు సాయంగా వైద్య పరికరాలు పంపిన ఒమన్
- May 13, 2021
మస్కట్: కోవిడ్ 19 వేరియంట్లతో పోరాటం చేస్తున్న భారత్ కు బాసటగా నిలుస్తామని ప్రకటించిన ఒమన్ ప్రభుత్వం..ఆ మేరకు తమవంతు సాయంగా వైద్య పరికరాలను పంపింది. వెంటిలేటర్లు, SPO2 మానిటర్లు, ఇతర వైద్య పరికరాలతో కూడిన రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానం ఒమన్ నుంచి బయల్దేరి భారత్ చేరుకుంది. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలకు చేదోడుగా నిలబడటం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు ఒమన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఒమన్ సాహయాన్ని స్వాగతించిన భారత్..సంక్షోభ సమయంలో మద్దతుగా నిలబడి రెండు దేశాల చిరకాల మిత్రత్వాన్ని, స్నేహశీలతను మరోసారి చాటినట్లు అయ్యిందని అభిప్రాయపడింది. ఒమన్ ప్రభుత్వం, ప్రజలకు ధన్యవాదాలు వ్యక్తం చేసింది. అలాగే ఒమన్ లోని ప్రవాస భారతీయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. మాతృదేశ ప్రజల కోసం ఒమన్ లోని ప్రవాస భారతీయులు 100 అక్సిజన్ సిలిండర్లు, 30 ఆక్సిజన్ కాన్సంట్రేట్లు పంపించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్
- పిల్లలను కొట్టొద్దు..పేరెంట్స్ కు దుబాయ్ పోలీసులు సలహా..!!
- 24వేల రవాణా సంస్థలను హెచ్చరించిన TGA..!!
- టూర్ ఆఫ్ ఫ్లాండర్స్ సైక్లిస్టులకు జరిమానాలు..!!









