భారత్ కు సాయంగా వైద్య పరికరాలు పంపిన ఒమన్

- May 13, 2021 , by Maagulf
భారత్ కు సాయంగా వైద్య పరికరాలు పంపిన ఒమన్

మస్కట్: కోవిడ్ 19 వేరియంట్లతో పోరాటం చేస్తున్న భారత్ కు బాసటగా నిలుస్తామని ప్రకటించిన ఒమన్ ప్రభుత్వం..ఆ మేరకు తమవంతు సాయంగా వైద్య పరికరాలను పంపింది. వెంటిలేటర్లు, SPO2 మానిటర్లు, ఇతర వైద్య పరికరాలతో కూడిన రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానం ఒమన్ నుంచి బయల్దేరి భారత్ చేరుకుంది. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలకు చేదోడుగా నిలబడటం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు ఒమన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే..ఒమన్ సాహయాన్ని స్వాగతించిన భారత్..సంక్షోభ సమయంలో మద్దతుగా నిలబడి రెండు దేశాల చిరకాల మిత్రత్వాన్ని, స్నేహశీలతను మరోసారి చాటినట్లు అయ్యిందని అభిప్రాయపడింది. ఒమన్ ప్రభుత్వం, ప్రజలకు ధన్యవాదాలు వ్యక్తం చేసింది. అలాగే ఒమన్ లోని ప్రవాస భారతీయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. మాతృదేశ ప్రజల కోసం ఒమన్ లోని ప్రవాస భారతీయులు 100 అక్సిజన్ సిలిండర్లు, 30 ఆక్సిజన్ కాన్సంట్రేట్లు పంపించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com