మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

- May 13, 2021 , by Maagulf
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

ముంబై: భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.వైరస్ సెకెండ్ వేవ్ దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.నిత్యం నాలుగు ల‌క్షల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. అత్యధిక కేసులతో మహారాష్ట్ర అల్లాడిపోతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను మ‌రోమారు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది.

బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వశాఖతో పాటు ఇత‌ర‌ మంత్రులు లాక్‌డౌన్‌ను మరో 15 రోజులు అంటే మే చివరి వరకు పొడిగించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిర్ణయం తీసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com