7 కమర్షియల్ కాంప్లెక్స్ లు, ఫిష్ మార్కెట్లో నేడు వ్యాక్సినేషన్
- May 18, 2021కువైట్: కోవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తున్న కువైట్..మొబైల్ యూనిట్లతో క్షేత్ర స్థాయికి వెళ్లి మరీ వ్యాక్సిన్ ఇస్తోంది. ముఖ్యంగా ప్రజలతో కాంటాక్ట్ అయ్యే రంగాల్లోని ఉద్యోగులను ఎంపిక చేసి మొబైల్ యూనిట్ల ద్వారా వ్యాక్సిన్ అందిస్తోంది. ఇందులో భాగంగా 7 కమర్షియల్ కాంప్లెక్స్ లతో పాటు ఫిష్ మార్కెట్ లో దాదాపు 8000 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. బౌలేవార్డ్, సింఫనీ మాల్, ముహల్లాబ్ మాల్, లైలా గ్లేరీ, ఫనార్ కాంప్లెక్స్, అల్-జహ్రా అవ్తాడ్ కాంప్లెక్స్, జహ్రా మాల్ కాంప్లెక్స్ లకు మొబైల్ యూనిట్లు తరలిస్తున్నట్లు ప్రాథమిక ఆరోగ్య అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ వివరించారు. అలాగే ఫిష్ మార్కెట్లోని కార్మికులకు కూడా తమ మొబైల్ యూనిట్లు వ్యాక్సిన్ అందిస్తాయన్నారు. ఇదిలాఉంటే..ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆయా కాంప్లెక్స్ లలో 35,000 నుంచి 36,000 మందికి వ్యాక్సిన్ అందినట్లు అవుతుందన్నారు. ఇక ఎయిర్ పోర్టులతో పాటు వినియోగదారు వస్తు ఉత్పత్తులు చేసే కంపెనీలు, ఫ్యాక్టరీలలో మూడో విడత వ్యాక్సినేషన్ నిర్వహిస్తామని వెల్లడించారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి