SBI ఖాతాదారులకు అలర్ట్..
- May 21, 2021
SBI ఖాతాదారులు తమ కెవైసి వివరాలను ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా అప్డేట్ చేసుకోవడానికి ఎస్బిఐ అనుమతిస్తుందని సంస్థ ప్రకటించింది. వినియోగదారులు తమ KYC వివరాలను సమర్పించడానికి బ్రాంచ్ ని సందర్శించాల్సిన అవసరం లేదని 2021 మే 1 న ఎస్బిఐ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించింది. కోవిడ్ -19 కేసులు పెరగడంతో వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ల కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు ఎస్బిఐ పేర్కొంది. KYC వివరాలను ఇంటి నుంచి ఎలా అప్డేట్ చేయాలి
కేవైసీ వివరాలు అప్డేట్ చేయకపోతే బ్యాంకింగ్ సేవలు పూర్తి స్థాయిలో పొందలేరని, బ్యాంకింగ్ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చని ఎస్బీఐ చెబుతోంది. కాబట్టి ఎస్బీఐ ఖాతాదార్లు అందరూ తప్పనిసరిగా 2021 మే 31 లోగా తమ కేవైసీని అప్డేట్ చేయాలి.ఖాతాదార్లు తమ హోమ్ బ్రాంచ్ లో మాత్రమే కాదు దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్ లో కూడా కేవైసీ వివరాలు అప్ డేట్ చేయొచ్చు.భయపెడుతున్న కరోనా మహమ్మారి దానికి తోడు లాక్డౌన్.ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకుకు వెళ్లే పని లేకుండా ఇంటి నుంచే సంబంధిత డాక్యుమెంట్స్ ని ఖాతాదార్లు ఇ మెయిల్ ద్వారా బ్యాంకుకు పంపితే సరిపోతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







