ఒకే ఒక్క డోసుతో అవసరమైన ఇమ్యూనిటీ లభించదు
- May 22, 2021
జెడ్డా: ఒకే ఒక్క డోసుతో తగినంత ఇమ్యూనిటీ లభించదని సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. ఖచ్చితంగా రెండో డోస్ కూడా వేసుకుని, కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవాలని సౌదీలకు హెల్త్ మినిస్ట్రీ సూచించింది. ప్రస్తుతం నాలుగు అనుమతి పొందిన వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనకా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ మరియు మోడెర్నా అందుబాటులో వున్నాయని మినిస్ట్రీ పేర్కొంది. తొలి డోసు తర్వాత కరోనా సోకితే, రెండో డోస్ కోసం కొంత అదనపు సమయం అవసరమవుతుందని మినిస్ట్రీ వెల్లడించింది. కోలుకున్నాక ఆరు నెలల తర్వాతే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ తలెత్తవని మినిస్ట్రీ అభిప్రాయపడింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇతర వ్యాక్సిన్ల కోసం ఖచ్చితంగా 14 రోజుల గ్యాప్ పాటించాలని మినిస్ట్రీ చెబుతోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









