ఒకే ఒక్క డోసుతో అవసరమైన ఇమ్యూనిటీ లభించదు

- May 22, 2021 , by Maagulf
ఒకే ఒక్క డోసుతో అవసరమైన ఇమ్యూనిటీ లభించదు

జెడ్డా: ఒకే ఒక్క డోసుతో తగినంత ఇమ్యూనిటీ లభించదని సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. ఖచ్చితంగా రెండో డోస్ కూడా వేసుకుని, కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవాలని సౌదీలకు హెల్త్ మినిస్ట్రీ సూచించింది. ప్రస్తుతం నాలుగు అనుమతి పొందిన వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనకా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ మరియు మోడెర్నా అందుబాటులో వున్నాయని మినిస్ట్రీ పేర్కొంది. తొలి డోసు తర్వాత కరోనా సోకితే, రెండో డోస్ కోసం కొంత అదనపు సమయం అవసరమవుతుందని మినిస్ట్రీ వెల్లడించింది. కోలుకున్నాక ఆరు నెలల తర్వాతే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ తలెత్తవని మినిస్ట్రీ అభిప్రాయపడింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇతర వ్యాక్సిన్ల కోసం ఖచ్చితంగా 14 రోజుల గ్యాప్ పాటించాలని మినిస్ట్రీ చెబుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com