ఒకే ఒక్క డోసుతో అవసరమైన ఇమ్యూనిటీ లభించదు
- May 22, 2021
జెడ్డా: ఒకే ఒక్క డోసుతో తగినంత ఇమ్యూనిటీ లభించదని సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పేర్కొంది. ఖచ్చితంగా రెండో డోస్ కూడా వేసుకుని, కరోనా వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవాలని సౌదీలకు హెల్త్ మినిస్ట్రీ సూచించింది. ప్రస్తుతం నాలుగు అనుమతి పొందిన వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనకా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ మరియు మోడెర్నా అందుబాటులో వున్నాయని మినిస్ట్రీ పేర్కొంది. తొలి డోసు తర్వాత కరోనా సోకితే, రెండో డోస్ కోసం కొంత అదనపు సమయం అవసరమవుతుందని మినిస్ట్రీ వెల్లడించింది. కోలుకున్నాక ఆరు నెలల తర్వాతే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలూ తలెత్తవని మినిస్ట్రీ అభిప్రాయపడింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇతర వ్యాక్సిన్ల కోసం ఖచ్చితంగా 14 రోజుల గ్యాప్ పాటించాలని మినిస్ట్రీ చెబుతోంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







