తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- May 22, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,308 మందికి పాజిటివ్గా తేలింది.మరో 21 మంది కోవిడ్తో ప్రాణాలు కోల్పోగా.. ఇదే సమయంలో 4,723 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 5,51,035కు చేరగా.. ఇప్పటి వరకు 5,04,970కు మంది కోవిడ్ సోకి కోలుకున్నారు. మరోవైపు కోవిడ్తో ఇప్పటి వరకు 3,106 మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 42,959 యాక్టివ్ కేసులు ఉన్నాయి.అటు అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 513 కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది ప్రభుత్వం.రికవరీ రేటు రాష్ట్రంలో 91.64 శాతంగా ఉంటే.. దేశంలో 87.7 శాతంగా ఉందని బులెటిన్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









