వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా నుంచి పూర్తి భద్రత: హెల్త్ మినిస్ట్రీ

- May 25, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్ ద్వారానే కరోనా నుంచి పూర్తి భద్రత: హెల్త్ మినిస్ట్రీ

మనామా: కరోనా వ్యాక్సినేషన్ బూస్టర్ డోసుల్ని తీసుకోవాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, పౌరులు అలాగే నివాసితులకు సూచించింది. కరోనా వైరస్ మీద పోరాటంలో వ్యాక్సినేషన్ ద్వారానే పూర్తి భద్రత లభిస్తుందని మినిస్ట్రీ అభిప్రాయపడింది. వ్యాక్సినేషన్ తీసుకుంటే, చాలా అరుదుగా కరోనా సోకే అవకాశం వుంటుందనీ, కరోనా సోకినా, వ్యాక్సినేషన్ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు వుండవని మినిస్ట్రీ పేర్కొంది. కరోనా వల్ల సంభవించిన మరణాల్ని తీసుకుంటే, 95 శాతం వ్యాక్సినేషన్ పొందనివారిలోనే కనిపించిందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారూ ఫేస్ మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం చేయాలని మినిస్ట్రీ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com