చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- January 17, 2026
బెంగళూరు: కర్ణాటకలోని, బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ సందడి మొదలుకానుంది. అంతర్జాతీయ మ్యాచ్లు, ఐపీఎల్ లు ఈ స్టేడియంలో నిర్వహించేందుకు,, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) శనివారం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మ్యాచ్లు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో నెలకొన్న అనిశ్చితికి ఈ అనుమతితో తెరపడింది.
జూన్ 4న జరిగిన ఈ విషాద ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 56 మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బీసీసీఐ… దులీప్ ట్రోఫీ, ఇండియా-సౌతాఫ్రికా ‘ఏ’ సిరీస్, విజయ్ హజారే ట్రోఫీతో పాటు 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సహా పలు కీలక టోర్నీలను చిన్నస్వామి నుంచి తరలించింది. ఈ విషాదంపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ మైఖేల్ డి’కున్హా కమిటీ సిఫార్సులను అమలు చేస్తేనే మ్యాచ్ల నిర్వహణకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, భద్రత, ప్రేక్షకుల నిర్వహణకు సంబంధించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని కేఎస్సీఏ అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ హామీ ఇచ్చారు.ప్రభుత్వం నుంచి అనుమతి లభించినప్పటికీ, ఐపీఎల్ 2026లో ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్లన్నీ చిన్నస్వామిలోనే ఆడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, రెండు మ్యాచ్లను రాయ్పూర్లో నిర్వహించేందుకు ఆ జట్టు యాజమాన్యం ఇటీవలే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







