ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం భేటీ…
- May 28, 2021
కోల్ కతా: బెంగాల్ ఎన్నికల తరువాత మొదటిసారి ప్రధాని బెంగాల్ వెళ్తున్నారు.యాస్ తుఫాన్ కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిశాయి.ఈ భారీ వర్షాల కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.కాగా, తుఫాన్ బాదిత ప్రాంతలను ఈరోజు ప్రధాని మోడి ఎరియల్ సర్వే నిర్వహించబోతున్నారు.ఉదయం 11 గంటలకు భువనేశ్వర్లో ప్రధాని మోదీ తుఫానుపై సమీక్ష నిర్వహించనున్నారు.అనంతరం, మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 02:15 గంటల వరకు తుఫాన్ బాదిత ప్రాంతల్లో ఏరియల్ సర్వేను నిర్వహిస్తారు.ఒడిశానుంచి మోడి పశ్చిమ బెంగాల్కు వెళ్తారు.కలైకుండ ఎయిర్ఫోర్స్ ఎయిర్పోర్టు వద్ద ప్రధానికి బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్వాగతం పలకనున్నారు.అనంతరం బెంగాల్ తుఫాన్పై ప్రధాని మోడి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.సమీక్షా సమావేశంలో సీఎం మమతా బెనర్జీ,గవర్నర్ జగ్దీప్ ధన్కర్ లు పాల్గొంటారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







