8000 మంది విమానాశ్రయ సిబ్బంది లక్ష్యంగా వ్యాక్సినేషన్

- May 28, 2021 , by Maagulf
8000 మంది విమానాశ్రయ సిబ్బంది లక్ష్యంగా వ్యాక్సినేషన్

కువైట్ సిటీ: దేశవ్యాప్తంగా వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేసుకున్న కువైట్ ప్రభుత్వం...ప్రతి రంగంలోని సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మొబైల్ యూనిట్లను ఏర్పాటు చేసి పలు రంగాల్లోని సిబ్బందికి వారి దగ్గరికే వెళ్లి వ్యాక్సిన్ ఇస్తోంది. నాలుగోరోజు కార్యచరణలో భాగంగా నేడు విమానాశ్రయ సిబ్బందికి వ్యాక్సినేషన్ చేపట్టనుంది. మొత్తం 10 మొబైల్ యూనిట్లు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాయి. కువైట్ విమానాశ్రయంలోని నేషనల్ ఏవియేషన్ సర్వీసెస్, కువైట్ ఏవియేషన్ సర్వీసెస్ కో., డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫీస్ సిబ్బందితో పాటు ఎయిర్ పోర్టులోని షాపులు, రెస్టారెంట్ల సిబ్బందికి కూడా వ్యాక్సిన్ వేయనున్నారు. మొత్తం 8000 వేల మందికి మొబైల్ వ్యాక్సిన్ యూనిట్ సిబ్బంది వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com