విరించి హాస్పిటల్ కోవిడ్ లైసెన్స్ రద్దు..
- May 28, 2021
హైదరాబాద్: కరోనా మహమ్మారి ఓ వైపు కల్లోలం సృష్టిస్తే.. మరోవైపు.. అదే అదునుగా అందినకాడికి దండుకుంటూ..సామాన్య, మధ్య తరగతి ప్రజల ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు..ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి 66 ఆస్పత్రులపై 88 ఫిర్యాదులు అందగా..అన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.. ఇక, మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలను ప్రారంభించింది ప్రభుత్వం…బంజారాహిల్స్ లోని విరించి ఆస్పత్రికి కోవిడ్ లైసెన్స్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.ఇక కోవిడ్ పేషెంట్లను చేర్చుకోవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.ఉన్న కోవిడ్ పేషెంట్ల విషయంలో ప్రొటొకాల్ ప్రకారం చికిత్స అందించాలని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు తేలితే ఆస్పత్రి లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. కాగా, నల్గొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తి విరించిలో కోవిడ్ చికిత్స కోసం చేరడం.. పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే కాగా.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ వంశీకృష్ణ బంధువులు ఆందోళనకు దిగడం.. ఆస్పత్రిపై దాడి చేయడం కూడా జరిగింది.అయితే, 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నోటీసు పంపినా..సమాధానం రాకపోవడంతో.. కోవిడ్ లైసెన్స్ రద్దు చేశారు.కాగా,గతంలో కూడా విరించి ఆస్పత్రి పై చర్యలు తీసుకున్న సందర్భాలు లేకపోలేదు.ఆయినా ఆ ఆస్పత్రి యాజమాన్యం తీరు మారడం లేదు. ఇక, విరించిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







