కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో లేనంతగా గుర్తింపు
- March 06, 2016
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో లేనంతగా గుర్తింపు లభించనుంది. పౌరులకు మంచి సేవలు అందించినందుకుగానీ ఇప్పటి వరకు అవార్డులు ఇస్తూ వస్తుండగా.. ఇకపూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఉత్తమ సహకారం అందించినందుకు ప్రధానమంత్రి అవార్డులతో సత్కరించనున్నారు.ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీకి మానస పుత్రికల్లాంటి స్వచ్ఛ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాలు విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ఉద్యోగులుగానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గానీ విశేషంగా కృశిచేస్తే వారికి ప్రధాని చేతులమీదుగా అవార్డులను అందిస్తారు. ఈ అవార్డులను పౌర సేవల దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 21న అందించనున్నారు.సాధారణంగా ప్రతి సవత్సరం పౌరులకు ఉత్తమ సేవలు అందించే ఉద్యోగులకు ప్రధానమంత్రి అవార్డులు అందిస్తుంటారు. కానీ, ఈసారి స్వచ్ఛ భారత్ అభియాన్(గ్రామిణ్), స్వచ్ఛ విద్యాలయ, ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకంతోపాటు సాయిల్ హెల్త్ కార్డ్ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఉద్యోగులకు అవార్డులు అందించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









