ఫోన్ స్కామ్: మహిళను మోసం చేసిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష

- May 31, 2021 , by Maagulf
ఫోన్ స్కామ్: మహిళను మోసం చేసిన కేసులో ఇద్దరికి జైలు శిక్ష

మనామా: ఇద్దరు ఆసియా జాతీయులైన వ్యక్తులకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఏడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే, నిందితులు ఓ మహిళను మోసం చేశారు ఫోన్ స్కామ్ ద్వారా. 2,000 బహ్రెయినీ దినార్లను మహిళ నుంచి ఫోన్ స్కామ్ ద్వారా నిందితులు దోచుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థానిక ఎక్స్‌ఛేంజ్ కంపెనీ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకుని, నిందితులు బాధితురాలి నుంచి డబ్బు కాజేశారు. కార్డు రద్దు చేయబడుతుందంటూ ఆమెను నిందితులు పక్కదోవపట్టించి, బ్యాంకు వివరాలు తెలుసుకుని, ఆమెను మోసం చేశారు నిందితులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com