మహారాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్...
- June 02, 2021ముంబై: మహారాష్ట్రలోని గ్రామాల్లో కరోనా కట్టడి లక్ష్యంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఓ కొత్త ప్రోగ్రాం ప్రకటించారు. కరోనా రహిత గ్రామంగా నిలిచే గ్రామాలకి రూ. 50 లక్షలు బహుమతి ఇస్తామన్నారు. ఒక్కో రెవెన్యూ డివిజన్ లో ఈ తరహ గ్రామాల్లో 22 అంశాల ఆధారంగా పరిశీలన జరిపి బహుమతులు ఇస్తామన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడు గ్రామాలను ఎంపిక చేసే తొలి, రెండో, మూడవ బహుమతులను ఇస్తామన్నారు. మొదటి బహుమతికి 50 లక్షలు కాగా, రెండో బహుమతికి రూ .25 లక్షలు, మూడో బహుమతికి రూ .15 లక్షలు లభిస్తాయి. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో మంగళవారం నాటికీ గడిచిన 24 గంటల్లో 14,123 కోవిడ్ కేసులు, 477 మరణాలు నమోదయ్యాయి. దీనితో కరోనా కేసుల సంఖ్య 57,61,015 కి చేరింది. మరణాల సంఖ్య 96,198 కు చేరుకుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..