భారత సంతతి ఇంజనీర్‌కు యూఏఈ గోల్డెన్ వీసా

- June 03, 2021 , by Maagulf
భారత సంతతి ఇంజనీర్‌కు యూఏఈ గోల్డెన్ వీసా

యూఏఈ: భారత సంతతికి చెందిన ఇంజనీర్‌కు యూఏఈ గోల్డెన్ వీసా లభించింది. అబుధాబిలో ఉండే భార‌తీయ ఇంజ‌నీర్ శ్యామ్ కొట్టూరి(45) 10 ఏళ్ల గోల్డెన్ వీసా ద‌క్కించుకున్నారు.మే 3న ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్ (ICA) నుంచి ఆయ‌న గోల్డెన్ వీసా అందుకున్నారు. ప్రత్యేక ప్రతిభ కెట‌గిరీ- ఇంజనీరింగ్ విభాగంలో కంప్యూటర్ ఇంజనీరింగ్ రంగంలో శ్యామ్‌ చేసిన కృషికి గుర్తింపుగా యూఏఈ ఆయ‌న‌కు గోల్డెన్ వీసా ఇచ్చింది. సీనియర్ ఐటీ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ అయిన శ్యామ్ గ‌త తొమ్మిదేళ్లుగా యూఏఈలో నివాస‌ముంటున్నారు.ఆయ‌న‌కు భార్య అరుణ పెరి, 15 ఏళ్ల కుమారుడు శ్రీవిష్ణు ఉన్నారు.   

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com