విజయవాడలో పాస్‌పోర్టు సేవలు పునః ప్రారంభం

- June 03, 2021 , by Maagulf
విజయవాడలో పాస్‌పోర్టు సేవలు పునః ప్రారంభం

అమరావతి: విజయవాడ లో పాస్‌పోర్టు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.నగరంలోని రీజియిన్‌ పాస్‌పోర్టు కేంద్రం పరిధిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి పాస్‌పోర్టు సేవలను అధికారులు ప్రారంభించారు.అత్యవసరమైన వారికి సేవలందించాలన్న లక్ష్యంతోనే రోజుకు 3 గంటల మేర సేవలందించాలని నిర్ణయించారు.సాధారణ సమయంలో రోజూ సగటున 250 వరకు పాస్‌పోర్టు దరఖాస్తులను పరిశీలిస్తుంటారు.ప్రస్తుత కోవిడ్ పరిస్థితులలో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే కార్యాలయం పనిచేస్తుంది.కోవిడ్ నిబంధనలను అనుసరించి ప్రతి రోజూ చాలా తక్కువ సంఖ్యలోనే స్లాట్స్‌ కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అత్యవసరమైతేనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా రీజనల్‌ పాస్‌పోర్టు ఆఫీసర్‌ శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com