మనసే సాక్షి
- June 02, 2015
వయసు మీద పడుతున్నకొద్దీ
మనిషికి మృత్యు భయం
మొదలవుతుంది
చుట్టూ ప్రకృతి ఉన్నా
మనిషి దాని నుండి
పాఠాలు నేర్చుకోడు
తెల్లని మబ్బు
నల్లగా మారి
బరువెక్కి వర్షించి
తేట పడుతుంది
తన ధర్మాన్ని
తాను నేరవేర్చానని
సంతృప్తి పడుతుంది
చెట్టు మొక్కగా
మొదలై
మహా వృక్షంగా
శాఖోపశాఖాలుగా
విస్తరిస్తుంది
తొలిరోజుల్లో
నీటికోసం ఆర్తి చెందినా
బలాన్ని పుంజుకున్నాక
గాలి వేగాన్ని
జడి వానల్నీ
తట్టుకుంటుంది
చేతనైనంత మేరకు
ప్రపంచానికి
సేవ చేస్తుంది
కాయలనూ
పండ్లనూ
విరగకాసి
అడగకుండానే
ఇస్తుంది
రాళ్ళు విసిరిన
చేతులకు కూడా
గాయపడిన
ఫలాలని అందిస్తుంది
ఒంటిని వలిచి
బెరడును ఇస్తుంది
కొమ్మలపై
పిల్లలకూ పక్షులకూ
సేద చేకూరుస్తుంది
వయసు మళ్ళాక
శక్తి ఉడిగాక
ఖరీదైన కలపగా
జీవితాన్ని
సార్ధకం చేసుకుంటుంది
మనిషి మాత్రం
తన కోసమే
బ్రతుకుతాడు
'తన' వలయంలోనే
తనువు చాలిస్తాడు
దీర్ఘ నిద్ర
మాట సరే!
ప్రతిరాత్రీ
నిదురిస్తాడుకదా!
తానెవరికైనా
ఆ రోజున మంచి చేశాడా?
అలా అని ఆలోచించాడా?
ప్రకృతి ధర్మమైన
వార్ధక్యాన్ని మృత్యువునీ
ఎందుకు నిరసిస్తాడు?
భగవంతుడిని
పూజించాడో లేదో!
వదిలేద్దాం!
ఆఖరి క్షణాలలోనైనా
సాటి మనిషికి
సాయం పడితే
ఆ ఆఖరి క్షణాలు
అతన్ని గురించి
మంచి జ్ఞాపకాలుగా
మిగిలిపోతాయికదా!
--- డా|| మాదిరాజు రామలింగేశ్వర రావు, మచిలీపట్నం.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







