మనసే సాక్షి
- June 02, 2015
వయసు మీద పడుతున్నకొద్దీ
మనిషికి మృత్యు భయం
మొదలవుతుంది
చుట్టూ ప్రకృతి ఉన్నా
మనిషి దాని నుండి
పాఠాలు నేర్చుకోడు
తెల్లని మబ్బు
నల్లగా మారి
బరువెక్కి వర్షించి
తేట పడుతుంది
తన ధర్మాన్ని
తాను నేరవేర్చానని
సంతృప్తి పడుతుంది
చెట్టు మొక్కగా
మొదలై
మహా వృక్షంగా
శాఖోపశాఖాలుగా
విస్తరిస్తుంది
తొలిరోజుల్లో
నీటికోసం ఆర్తి చెందినా
బలాన్ని పుంజుకున్నాక
గాలి వేగాన్ని
జడి వానల్నీ
తట్టుకుంటుంది
చేతనైనంత మేరకు
ప్రపంచానికి
సేవ చేస్తుంది
కాయలనూ
పండ్లనూ
విరగకాసి
అడగకుండానే
ఇస్తుంది
రాళ్ళు విసిరిన
చేతులకు కూడా
గాయపడిన
ఫలాలని అందిస్తుంది
ఒంటిని వలిచి
బెరడును ఇస్తుంది
కొమ్మలపై
పిల్లలకూ పక్షులకూ
సేద చేకూరుస్తుంది
వయసు మళ్ళాక
శక్తి ఉడిగాక
ఖరీదైన కలపగా
జీవితాన్ని
సార్ధకం చేసుకుంటుంది
మనిషి మాత్రం
తన కోసమే
బ్రతుకుతాడు
'తన' వలయంలోనే
తనువు చాలిస్తాడు
దీర్ఘ నిద్ర
మాట సరే!
ప్రతిరాత్రీ
నిదురిస్తాడుకదా!
తానెవరికైనా
ఆ రోజున మంచి చేశాడా?
అలా అని ఆలోచించాడా?
ప్రకృతి ధర్మమైన
వార్ధక్యాన్ని మృత్యువునీ
ఎందుకు నిరసిస్తాడు?
భగవంతుడిని
పూజించాడో లేదో!
వదిలేద్దాం!
ఆఖరి క్షణాలలోనైనా
సాటి మనిషికి
సాయం పడితే
ఆ ఆఖరి క్షణాలు
అతన్ని గురించి
మంచి జ్ఞాపకాలుగా
మిగిలిపోతాయికదా!
--- డా|| మాదిరాజు రామలింగేశ్వర రావు, మచిలీపట్నం.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







