14 నెలల తర్వాత ఇండియన్ షిప్ సిబ్బందికి విముక్తి
- June 05, 2021
కువైట్ సిటీ: న్యాయపరమైన చిక్కులతో 14 నెలలుగా కువైట్ లోనే చిక్కుకుపోయిన ఇండియన్ షిప్ సిబ్బందికి ఎట్టకేలకు విముక్తి లభించింది. మానవదృక్పథంతో కువైట్ చూపించిన చొరవ ఫలితంగా ఇండియన్ షిప్ సిబ్బంది సొంత దేశానికి పయనమయ్యారు.సిబ్బంది తిరుగు ప్రయాణానికి కువైట్ ప్రజా వ్యవహారాల శాఖ, సమాచార & ఐటీ శాఖ మంత్రి డాక్టర్ రన అల్ ఫరిస్ చేసిన కృషిని కువైట్లోని భారత రాయబారి సిబి జార్జ్ ప్రశంసించారు. ఆమె చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు.14 నెలలు క్రితం ఇండియాకు చెందిన షిప్ ULA సిబ్బంది న్యాయపరమైన చిక్కులతో సౌబా పోర్టులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే..డాక్టర్ అల్ ఫరిస్ వ్యక్తిగత చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించారని సిబి జార్జ్ వివరించారు. కువైట్ లోకల్, ఇంటర్నేషనల్ అధికారులతో మాట్లాడి సంక్షోభానికి మూడు నెలల్లో ముగింపు పలికారని కొనియాడారు.దీంతో భారత నౌనకు చెందిన సిబ్బంది 14 నెలల తర్వాత కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి సొంత దేశానికి పయనమయ్యారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







