హాస్య కథానాయకుడు నరేశ్ డాక్టర్ అయ్యారు!
- March 06, 2016ప్రస్తుతం క్యారెక్టర్ నటుడిగా బిజీగా ఉన్న ఒకప్పటి హాస్య కథానాయకుడు నరేశ్ డాక్టర్ అయ్యారు. అమెరికాలోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ దక్షిణాదిన తనకు, కర్ణాటకకు చెందిన ఓ నృత్య కళాకారిణికి డాక్టరేట్ ఇచ్చారని తెలిపారు. తనకు నటనలో ఓనమాలు నేర్పిన జంధ్యాల, విజయ నిర్మల, కృష్ణ, తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ డాక్టరేట్ అంకితం చేస్తున్నట్లు నరేశ్ చెప్పారు.ఇటీవలే తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా తాను నవరసరాయ అనే బిరుదును అందుకున్నానని, అదే సమయంలో ఈ డాక్టరేట్ కూడా అందుకోవడం మరింత ఆనందంగా ఉందని అన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు