హజ్ యాత్ర పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు:కేంద్ర మంత్రి అబ్బాస్ నఖ్వీ
- June 06, 2021న్యూ ఢిల్లీ: ఈ సంవత్సరం జరగనున్న హజ్ యాత్రపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. కరోనా రెండో దశ కొనసాగుతున్నందున హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సౌదీ ప్రభుత్వ నిర్ణయానికి భారత్ అండగా ఉంటుందన్నారు.యాత్ర గత సంవత్సరం రద్దయిందని, ఈ సంవత్సరం ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని నఖ్వీ పేర్కొన్నారు.
కరోనా వైరస్ సంక్రమణ నేపథ్యంలో సౌదీ అరేబియా గత ఏడాది ఇతర దేశాలకు చెందిన యాత్రికులు హజ్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. పరిమిత సంఖ్యలో దేశీయ యాత్రలకే మాత్రమే అనుమతి ఇచ్చింది.పరిమిత సంఖ్యలో యాత్రకు అనుమతి ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్