భారత్ - యూఏఈ ప్రయాణం పై అప్డేట్...ట్రావెల్ బ్యాన్ పొడిగింపు...

- June 08, 2021 , by Maagulf
భారత్ - యూఏఈ ప్రయాణం పై అప్డేట్...ట్రావెల్ బ్యాన్ పొడిగింపు...

యూఏఈ: భారత్ నుంచి వచ్చే విమానాలపై ట్రావెల్ బ్యాన్ ను తదుపరి ఆదేశాల వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది యూఏఈ. నేడు యూఏఈ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సస్పెన్షన్‌ను పొడిగించినట్లు తెలిపింది. ఈ క్రమంలో, భారత్ నుండి యూఏఈ కు జులై 6 వరకు విమానాలను నిషేదించటం జరిగింది అంటూ ఎయిర్ ఇండియా ప్రకటించింది. 

అయితే..యూఏఈ పౌరులు, గోల్డెన్ వీసాదారులు, దౌత్యపరమైన పనుల మీద ప్రయాణం చేసేవారు, సవరించిన కోవిడ్ ప్రోటోకాల్ మేరకు ప్రయాణానికి అనుమతించిన వర్గాల వారికి మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యూఏఈ వెల్లడించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం భారత్ నుంచి యూఏఈకి ప్రయాణాలపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని జాతీయ అత్యవసర, విపత్తుల నిర్వహణ అథారిటీ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com