అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్న మొలకెత్తే మాస్కులు
- June 08, 2021
కరోనా కాలంలో అనేక మాస్కులు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు సర్జికల్, మెడికేటెడ్ మాస్క్లు మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాటితోపాటుగా గుడ్డ మాస్క్ లు, పారదర్శక మాస్క్లు వంటికి కూడా అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, కర్ణాటకు చెందిన నితిన్ వ్యాన్ అనే వ్యక్తి పర్యావరణానికి మేలు చేకూర్చే విధంగా పేపర్ సీడ్ మాస్క్ ను తయారు చేశారు. కాటన్ గుడ్డను పల్స్ షీట్గా మార్చి 12 గంటలపాటు డ్రై చేసిన అనంతరం దానితో మాస్క్ ను తయారు చేస్తారు. ఈ పేపర్ పల్స్ షీట్లో వివిద రకాల కూరగాయల, ఔషద విత్తనాలు ఉంచుతారు. మాస్క్ ను వాడిన తరువాత పడేస్తే ఆ మాస్క్ నుంచి మొక్కలు మొలకెత్తుతాయి. దీని ఖరీరు కేవలం రూ.25 మాత్రమే. ఇండియాలో ఇప్పటికే దీనిని రిలీజ్ చేశారు. ఈ మాస్క్పై అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ మీడియా దృష్టిసారించింది. దీనిని తయారు చేసిన నితిన్ వ్యాన్ను ఇప్పటికే ఇంటర్యూ చేసింది. అమెరికా మీడియా అసక్తి కనబరచడంతో పేపర్ సీడ్ మాస్క్ కు అంతర్జాతీయంగా ఖ్యాతి లభించింది.

తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







