మరో మూడు దేశాల నుంచి ప్రయాణీకులపై నిషేధం విధించిన యూఏఈ

- June 09, 2021 , by Maagulf
మరో మూడు దేశాల నుంచి ప్రయాణీకులపై నిషేధం విధించిన యూఏఈ

యూఏఈ: జాంబియా, డిఆర్ కాంగో మరియు ఉగాండా దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపైన కూడా తాత్కాలిక నిషేధం విధించింది యూఈఏ. జూన్ 11 శుక్రవారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. అయితే, కొన్ని గ్రూపులకు మాత్రం మినహాయింపు వుంటుంది. యూఏఈ పౌరులు అలాగే వారి ఫస్ట్ డిగ్రీ బంధువులు అలాగే డిప్లమాటిక్ మిషన్ మీద వచ్చేవారికి ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తారు. అధికారిక డెలిగేషన్స్, వ్యాపరవేత్తలు, గోల్డెన్ మరియు సిల్వర్ రెసిడెన్సీ కలిగినవారు, ఎసెన్షియల్ ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా మినహాయింపు పొందుతారు. కాగా, పీసీఆర్ టెస్టింగ్ పీరియడ్ (ప్రయాణానికి ముందు) 72 గంటల నుంచి 48 గంటలకు కుదించారు. మినహాయింపు పొందిన గ్రూపులకు చెందినవారు తప్పనిసరిగా కరోనా నిబంధనలు, క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. 10 రోజుల క్వారంటైన్, ఎయిర్‌పోర్టులో పీసీఆర్ టెస్టు (4 మరియు 8వ రోజు.. దేశంలోకి ప్రవేశించిన తర్వాత) చేయించుకోవాలి. ఇండియా, యూఏఈ, బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం తదితర దేశాల నుంచి విమానాల్ని ఇటీవలే యూఏఈ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com