శివరాత్రి శోభతో వెలిగిపోతున్నా శైవ క్షేత్రాలు..
- March 07, 2016
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇవాళ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతోన్నాయి. శివరాత్రి శోభతో వెలిగిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివ దర్శనం కోసం దేవాలయాల వద్ద బారులు తీరారు. పలుచోట్ల భక్తులు నదీ స్నానాలు ఆచరించి శివలయాలను దర్శించుకుంటున్నారు. భక్తుల శివనామ స్మరణలతో దేవాలయాలు హోరెత్తుతున్నాయి. దక్షిణకాశీగా పేరొందిన కరీంనగర్ జిల్లా వేములవాడ ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో భక్తులు గోదావరి నదిలో స్నానాలుచేసి కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పలు శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









