రేపు యాదాద్రికి సీజేఐ ఎన్వీ రమణ
- June 12, 2021హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు సీజేఐ ఎన్వీ రమణ..తన కుటుంబ సభ్యులతో కలిసి.. గురువారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన..శుక్రవారం రోజు మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు.. ఆ తర్వాత తొలిసారి హైదరాబాద్కు వచ్చిన ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైకోర్టు చీఫ్ జస్టిస్,మంత్రులు స్వాగతం పలికితే.. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు.ఇక, ఈ సందర్భంగా రాత్రి గవర్నర్..రాజ్భవన్లో విందు కూడా ఇచ్చారు.రాజ్భవన్లోనే బస చేశారు సీజేఐ..మరోవైపు.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించుకోనున్నారు..జస్టిస్ ఎన్వీ రమణతోపాటు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ కూడా యాదాద్రికి వెళ్లనున్నారు.యాదాద్రిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..ఆలయాన్ని పునర్నిర్మిస్తుండగా.. ఇప్పటికే చాలా వరకు నిర్మాణపనులు పూర్తిచేశారు.తాజాగా..ఏర్పాటు చేసిన లైటింగ్తో యాదగిరీశుడి ఆలయం.. మెరిసిపోయింది..సీఎం కేసీఆర్..దగ్గరుండి..సీజేఐకి.. కొత్త ఆలయాన్ని చూపించే అవకాశం ఉందంటున్నారు.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..