'లాంఛ్ ఆఫర్'ని ప్రకటించిన జెట్ ఎయిర్వేస్
- March 07, 2016
ఒమన్ నుంచి ఢిల్లీ మీదుగా భారతదేశంలోని వివిధ నగరాలకు వెళ్ళే ప్రయాణీకుల కోసం జెట్ ఎయిర్ వేస్ 'లాంఛ్ ఆఫర్'ని ప్రకటించింది. ఈ ఆఫర్ ఏంటంటే, ప్రయాణీకులు మార్చ్ 6 నుంచి 12 మధ్యలో టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి టిక్కెట్ ధరలో 15 శాతం రాయితీ ఇవ్వనున్నారు. 31 మే వరకు ప్రయాణించేవారి కోసం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. జెట్ ఎయిర్ వేస్ జనరల్ మేనేజర్ రియాజ్ కుట్టెరి మాట్లాడుతూ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇండియాకి చెందిన ప్రీమియర్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్ మొత్తం 73 డెస్టినేషన్స్కి విమానాలు నడుపుతోంది. ఇందులో 51 భారతదేశంలోనివి కాగా, 22 ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. 116 ఎయిర్ క్రాఫ్ట్లను జెట్ ఎయిర్ వేస్ వినియోగిస్తోంది. వీటిల్లో బోయింగ్ 777-300 ఇర్, ఎయిర్ బస్ ఎ330-200/300, నెక్స్ట్ జనరేషన్ బోయింగ్ 737 మరియు ఎటిఆర్ 72-500/600 వంటివి ఉన్నాయి. జెట్ ఎయిర్ వేస్ ప్రకటించిన 15 శాతం డిస్కౌంట్ ఆఫర్ వినియోగించుకోవడానికి జెట్ ఎయిర్ వేస్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









