10 మంది కోవిడ్ పేషెంట్లలో 8 మంది వ్యాక్సిన్ పొందనివారే!
- June 13, 2021
దుబాయ్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి కంటే తీసుకోని వారిపైనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని దుబాయ్ ఎమిరాతి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ప్రతి 10 మందిలో 8 మంది వ్యాక్సిన్ తీసుకోని వాళ్లేనని వెల్లడించింది. దుబాయ్ హెల్త్ అథారిటీ విడుదల చేసిన గణాంకాల మేరకు ప్రస్తుతం కోవిడ్ తో ఆస్పత్రుల్లో చేరుతున్న వారు, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది వ్యాక్సిన్ తీసుకోలేదని స్పష్టం అవుతోంది. ఎమిరాతి పరిధిలోని ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, తద్వారా వైరస్ తీవ్రత తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని దుబాయ్ హెల్త్ అథారిటీ పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ తీసుకుంటే ఒక వేళ వైరస్ బారిన పడినా ఆస్పత్రిలో చేరకుండానే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







