10 మంది కోవిడ్ పేషెంట్లలో 8 మంది వ్యాక్సిన్ పొందనివారే!
- June 13, 2021దుబాయ్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి కంటే తీసుకోని వారిపైనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని దుబాయ్ ఎమిరాతి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ప్రతి 10 మందిలో 8 మంది వ్యాక్సిన్ తీసుకోని వాళ్లేనని వెల్లడించింది. దుబాయ్ హెల్త్ అథారిటీ విడుదల చేసిన గణాంకాల మేరకు ప్రస్తుతం కోవిడ్ తో ఆస్పత్రుల్లో చేరుతున్న వారు, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది వ్యాక్సిన్ తీసుకోలేదని స్పష్టం అవుతోంది. ఎమిరాతి పరిధిలోని ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, తద్వారా వైరస్ తీవ్రత తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని దుబాయ్ హెల్త్ అథారిటీ పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ తీసుకుంటే ఒక వేళ వైరస్ బారిన పడినా ఆస్పత్రిలో చేరకుండానే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ