10 మంది కోవిడ్ పేషెంట్లలో 8 మంది వ్యాక్సిన్ పొందనివారే!
- June 13, 2021
దుబాయ్: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి కంటే తీసుకోని వారిపైనే వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని దుబాయ్ ఎమిరాతి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ప్రతి 10 మందిలో 8 మంది వ్యాక్సిన్ తీసుకోని వాళ్లేనని వెల్లడించింది. దుబాయ్ హెల్త్ అథారిటీ విడుదల చేసిన గణాంకాల మేరకు ప్రస్తుతం కోవిడ్ తో ఆస్పత్రుల్లో చేరుతున్న వారు, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో ప్రతి పది మందిలో తొమ్మిది మంది వ్యాక్సిన్ తీసుకోలేదని స్పష్టం అవుతోంది. ఎమిరాతి పరిధిలోని ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, తద్వారా వైరస్ తీవ్రత తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకోవాలని దుబాయ్ హెల్త్ అథారిటీ పిలుపునిచ్చింది. వ్యాక్సిన్ తీసుకుంటే ఒక వేళ వైరస్ బారిన పడినా ఆస్పత్రిలో చేరకుండానే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







