బంగారు నగలపై ఫోర్జరీ ముద్ర..ఆసియా వ్యక్తి అరెస్ట్
- June 13, 2021కువైట్: బంగారు ఆభరణాలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ ఫోర్జరీ ముద్రను వేసినందుకు ఆసియా జాతీయుడిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది.బంగారు నగల విక్రయాలకు ముందుగా ఆయా నగల స్వచ్ఛత, బరువును తనిఖీ చేసి అన్ని సరిగ్గా ఉంటేనే వాణిజ్య మంత్రిత్వ శాఖ ముద్ర వేస్తుంది.ఆ తర్వాతే బంగారు నగలు అమ్మకానికి వీలుంటుంది. అయితే..ఆసియాకు చెందిన వ్యక్తి మాత్రం మంత్రిత్వ శాఖ తనిఖీలు లేకుండానే నకిలీ మినిస్ట్రి స్టాంప్ తో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు.క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, వాణిజ్య మంత్రిత్వ శాఖ సంయుక్త ఆపరేషన్లో ఫోర్జరీ గుట్టు బయటపడింది. దీంతో అతన్ని అధికారులు అరెస్టు చేశారు. స్టాంప్ను ఫోర్జరీ చేసేందుకు వినియోగించిన లేజర్ పరికరం, ల్యాప్టాప్ కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?