బంగారు నగలపై ఫోర్జరీ ముద్ర..ఆసియా వ్యక్తి అరెస్ట్
- June 13, 2021కువైట్: బంగారు ఆభరణాలపై వాణిజ్య మంత్రిత్వ శాఖ ఫోర్జరీ ముద్రను వేసినందుకు ఆసియా జాతీయుడిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది.బంగారు నగల విక్రయాలకు ముందుగా ఆయా నగల స్వచ్ఛత, బరువును తనిఖీ చేసి అన్ని సరిగ్గా ఉంటేనే వాణిజ్య మంత్రిత్వ శాఖ ముద్ర వేస్తుంది.ఆ తర్వాతే బంగారు నగలు అమ్మకానికి వీలుంటుంది. అయితే..ఆసియాకు చెందిన వ్యక్తి మాత్రం మంత్రిత్వ శాఖ తనిఖీలు లేకుండానే నకిలీ మినిస్ట్రి స్టాంప్ తో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు.క్రిమినల్ సెక్యూరిటీ విభాగం, వాణిజ్య మంత్రిత్వ శాఖ సంయుక్త ఆపరేషన్లో ఫోర్జరీ గుట్టు బయటపడింది. దీంతో అతన్ని అధికారులు అరెస్టు చేశారు. స్టాంప్ను ఫోర్జరీ చేసేందుకు వినియోగించిన లేజర్ పరికరం, ల్యాప్టాప్ కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ