భారత్ కరోనా అప్డేట్

- June 16, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. పాజిటీవ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో స‌డ‌లింపులు ఇస్తున్నారు.తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను విడుదల చేసింది.ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 62,224 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,96,33,105కి చేరింది.ఇందులో 2,83,88,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.8,65,432 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే,గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 2,542 మంది మృతి చెందారు.భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,79,573కి చేరింది.గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో 1,07,628 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.భారత్ లో ఇప్ప‌టివ‌ర‌కు 26,19,72,014 మందికి వ్యాక్సిన్ అందించారు.24 గంట‌ల్లో 28 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ అందించిన‌ట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com