80% ఉద్యోగులతో ఆఫీసుల నిర్వహణకు అనుమతి

- June 17, 2021 , by Maagulf
80% ఉద్యోగులతో ఆఫీసుల నిర్వహణకు అనుమతి

ఖతార్: కోవిడ్ తీవ్రత కొద్దిమేర తగ్గుముఖం పట్టడంతో ఖతార్ ప్రభుత్వం దశలవారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేట్ రంగంలోని ఆఫీసులు తమ పూర్తి సామర్ధ్యంలో 80 శాతం ఉద్యోగులను విధులకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. వైద్య, మిలటరీ, భద్రతా రంగాలకు సంబంధించి ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లకు కూడా అనుమతి ఇస్తున్నట్లు మంత్రి మండలి ప్రకటించింది. అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తు పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య వివాహాలు జరుపుకోవచ్చని కూడా స్పష్టం చేసింది. జూన్ 18 నుంచి ఈ సడలింపులు అమలులోకి వస్తాయి. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు మే 28 నుంచి జులై 30 లోగా నాలుగు దశలుగా ఆంక్షలను ఎత్తివేయాలని గత నెలలోనే మంత్రి మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆఫీసులకు 80 శాతం ఉద్యోగుల అనుమతి, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులకు పర్మిషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com