80% ఉద్యోగులతో ఆఫీసుల నిర్వహణకు అనుమతి
- June 17, 2021
ఖతార్: కోవిడ్ తీవ్రత కొద్దిమేర తగ్గుముఖం పట్టడంతో ఖతార్ ప్రభుత్వం దశలవారీగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేట్ రంగంలోని ఆఫీసులు తమ పూర్తి సామర్ధ్యంలో 80 శాతం ఉద్యోగులను విధులకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. వైద్య, మిలటరీ, భద్రతా రంగాలకు సంబంధించి ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లకు కూడా అనుమతి ఇస్తున్నట్లు మంత్రి మండలి ప్రకటించింది. అలాగే కోవిడ్ నిబంధనలు పాటిస్తు పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య వివాహాలు జరుపుకోవచ్చని కూడా స్పష్టం చేసింది. జూన్ 18 నుంచి ఈ సడలింపులు అమలులోకి వస్తాయి. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు మే 28 నుంచి జులై 30 లోగా నాలుగు దశలుగా ఆంక్షలను ఎత్తివేయాలని గత నెలలోనే మంత్రి మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆఫీసులకు 80 శాతం ఉద్యోగుల అనుమతి, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులకు పర్మిషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ







