వాహనదారులకు శుభవార్త..
- June 18, 2021
న్యూ ఢిల్లీ: వాహనదారులకు శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్ (DL) , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), ఫిట్ నెస్ వంటి అన్ని పత్రాల వ్యాలిడిటీని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సంక్షోభ సమయంలో ఫిబ్రవరి 20 తర్వాత వ్యాలిడిటీ గడువు ముగిసిన అన్ని వాహన పత్రాలపై వ్యాలిడిటీని పొడిగించింది. ఈ మేరకు రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గత ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును కేంద్ర ప్రభుత్వం గతంలో 2021 జూన్ 30 వరకు పొడిగించింది. మళ్లీ ఇప్పుడు ఆ గడువును సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వెహికల్ కు సంబంధించి ఫిట్నెస్, పర్మిట్లు, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్లు అన్నీ సెప్టెంబర్ 30 వరకు వ్యాలిడిటీని పెంచింది. పౌరులు, రవాణాదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అప్పటివరకూ వాహనదారులు ఈ డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయని, ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మోటారు వాహనాల చట్టం,1988, సెంట్రల్ మోటారు వాహన నిబంధనలు,1989 ప్రకారం.. ఫిట్నెస్, పర్మిట్లు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ లేదా ఇతర పత్రాల చెల్లుబాటును మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 30 వరకు పొడిగించిందని అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా పెనాల్టీ రూ.5,000 జరిమానా ఉంది. అదే పర్మిట్ లేకుండా రూ.10,000 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







