వాహనదారులకు శుభవార్త..
- June 18, 2021
న్యూ ఢిల్లీ: వాహనదారులకు శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్ (DL) , రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), ఫిట్ నెస్ వంటి అన్ని పత్రాల వ్యాలిడిటీని 2021 సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సంక్షోభ సమయంలో ఫిబ్రవరి 20 తర్వాత వ్యాలిడిటీ గడువు ముగిసిన అన్ని వాహన పత్రాలపై వ్యాలిడిటీని పొడిగించింది. ఈ మేరకు రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
గత ఏడాది ఫిబ్రవరి 1 నాటికి ముగిసిన అన్ని వాహన పత్రాల గడువును కేంద్ర ప్రభుత్వం గతంలో 2021 జూన్ 30 వరకు పొడిగించింది. మళ్లీ ఇప్పుడు ఆ గడువును సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వెహికల్ కు సంబంధించి ఫిట్నెస్, పర్మిట్లు, లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇతరత్రా డాక్యుమెంట్లు అన్నీ సెప్టెంబర్ 30 వరకు వ్యాలిడిటీని పెంచింది. పౌరులు, రవాణాదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సహకరించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అప్పటివరకూ వాహనదారులు ఈ డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయని, ఎలాంటి పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మోటారు వాహనాల చట్టం,1988, సెంట్రల్ మోటారు వాహన నిబంధనలు,1989 ప్రకారం.. ఫిట్నెస్, పర్మిట్లు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ లేదా ఇతర పత్రాల చెల్లుబాటును మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 30 వరకు పొడిగించిందని అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా పెనాల్టీ రూ.5,000 జరిమానా ఉంది. అదే పర్మిట్ లేకుండా రూ.10,000 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







