వాహనమిత్ర పథకం ఎంతో ఉపయోగపడుతుంది: ఏపీ హోం మంత్రి
- June 19, 2021
గుంటూరు: గుంటూరు నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాత్యులు మేకతోటి సుచరిత పాల్గొనడం జరిగింది.స్వర్ణభారతి నగర్ లో వాహన మిత్ర లబ్ధిదారులు ఏర్పాటు చేసిన కార్యకమనికి హోంమంత్రి ముఖ్య అతిధిగా విచ్చేసారు. వాహనమిత్ర లబ్దిదారులకు మూడవ విడతగా 10 వేల రూపాయలు ఇచ్చిన సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.హోంమంత్రి సుచరిత తో పాటు డివిజన్ కార్పోరేటర్లు, స్థానిక వైస్సార్సీపీ నాయకులు, ఆటో డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఆటో డ్రైవర్ల కష్టాలను, బాధలను తెలుసుకొని అధికారంలోకి వచ్చినవెంటనే 10 వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.గుంటూరు జిల్లా లో 22, 218 మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధిచేకూరిందన్నారు. ఈ వాహన మిత్ర పథకం భారత దేశంలో ఎక్కడా కూడా లేదన్నారు. ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్, ఫినెటెస్, ఆటో రిపేర్ లాంటి వాటికి ఈ వాహన మిత్ర పథకం ఎంతో ఉపయోగపడుతోందని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు.


తాజా వార్తలు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!







