వాహనమిత్ర పథకం ఎంతో ఉపయోగపడుతుంది: ఏపీ హోం మంత్రి
- June 19, 2021
గుంటూరు: గుంటూరు నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాత్యులు మేకతోటి సుచరిత పాల్గొనడం జరిగింది.స్వర్ణభారతి నగర్ లో వాహన మిత్ర లబ్ధిదారులు ఏర్పాటు చేసిన కార్యకమనికి హోంమంత్రి ముఖ్య అతిధిగా విచ్చేసారు. వాహనమిత్ర లబ్దిదారులకు మూడవ విడతగా 10 వేల రూపాయలు ఇచ్చిన సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.హోంమంత్రి సుచరిత తో పాటు డివిజన్ కార్పోరేటర్లు, స్థానిక వైస్సార్సీపీ నాయకులు, ఆటో డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఆటో డ్రైవర్ల కష్టాలను, బాధలను తెలుసుకొని అధికారంలోకి వచ్చినవెంటనే 10 వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.గుంటూరు జిల్లా లో 22, 218 మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధిచేకూరిందన్నారు. ఈ వాహన మిత్ర పథకం భారత దేశంలో ఎక్కడా కూడా లేదన్నారు. ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్, ఫినెటెస్, ఆటో రిపేర్ లాంటి వాటికి ఈ వాహన మిత్ర పథకం ఎంతో ఉపయోగపడుతోందని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు.


తాజా వార్తలు
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!









