వాహనమిత్ర పథకం ఎంతో ఉపయోగపడుతుంది: ఏపీ హోం మంత్రి
- June 19, 2021
గుంటూరు: గుంటూరు నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాత్యులు మేకతోటి సుచరిత పాల్గొనడం జరిగింది.స్వర్ణభారతి నగర్ లో వాహన మిత్ర లబ్ధిదారులు ఏర్పాటు చేసిన కార్యకమనికి హోంమంత్రి ముఖ్య అతిధిగా విచ్చేసారు. వాహనమిత్ర లబ్దిదారులకు మూడవ విడతగా 10 వేల రూపాయలు ఇచ్చిన సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.హోంమంత్రి సుచరిత తో పాటు డివిజన్ కార్పోరేటర్లు, స్థానిక వైస్సార్సీపీ నాయకులు, ఆటో డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఆటో డ్రైవర్ల కష్టాలను, బాధలను తెలుసుకొని అధికారంలోకి వచ్చినవెంటనే 10 వేల రూపాయలు ఇవ్వడం జరిగిందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.గుంటూరు జిల్లా లో 22, 218 మంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లకు లబ్ధిచేకూరిందన్నారు. ఈ వాహన మిత్ర పథకం భారత దేశంలో ఎక్కడా కూడా లేదన్నారు. ఆటో డ్రైవర్లు ఇన్సూరెన్స్, ఫినెటెస్, ఆటో రిపేర్ లాంటి వాటికి ఈ వాహన మిత్ర పథకం ఎంతో ఉపయోగపడుతోందని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు.


తాజా వార్తలు
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం









