ఖతార్ లో తెలుగోడి మోసం
- June 19, 2021
విశాఖపట్నం: విశాఖపట్నానికి చెందిన పిన్నింటి సుబ్రహ్మణ్య శ్రీనివాస్ దోహా లో అల్ మీరా కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ లో బయ్యర్స్ డిపార్ట్మెంట్ హెడ్ గా పని చేస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఖతార్ నుంచి ఇండియాకు నిధులు పంపి,పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు.రూ.88 లక్షల పెట్టుబడులను ఫ్రీజ్(నిలుపుదల) చేశారు.
విశాఖకు చెందిన పిన్నింటి సుబ్రహ్మణ్య శ్రీనివాస్ దోహా లో ఉంటున్నారు. అక్కడి దోహా నేషనల్ బ్యాంకు నుంచి విశాఖలోని యాక్సిస్,హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకులకు రూ.45 లక్షలు బదిలీ చేశారు. వాటిని తన పేరిట మరియు ఆయన భార్య పేరిట మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టారు. సమాచారం అందుకున్న ఈడీ అధికారులు ఈ నెల 15న సీతమ్మధారలోని శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులతో పాటు.. మరో రూ.43 లక్షలతో మూడు ఇళ్ల స్థలాలు..చీపురువాలస,విజయనగరం జిల్లా మరియు విశాఖపట్నంలోని తాటిటూర్,గిడిజాలా గ్రామాలు దగ్గర కొనుగోలు చేసినట్టు గుర్తించారు.
ఇదిలా ఉండగా, జరిగిన ఘటన పై దర్యాప్తు జరిపి, శ్రీనివాస్ లంచం మొత్తంలో కూడబెట్టిన ఆస్తుల వివరాలను తెలుసుకొని..విచారణ అయ్యేవరకు వాటిని సీజ్ చేయవలసిందిగా ఈడీ ను కోరింది దోహాలోని ఒనైజా పోలీస్ స్టేషన్లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయం.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







