ఖతార్ లో తెలుగోడి మోసం
- June 19, 2021
విశాఖపట్నం: విశాఖపట్నానికి చెందిన పిన్నింటి సుబ్రహ్మణ్య శ్రీనివాస్ దోహా లో అల్ మీరా కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ లో బయ్యర్స్ డిపార్ట్మెంట్ హెడ్ గా పని చేస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా ఖతార్ నుంచి ఇండియాకు నిధులు పంపి,పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు.రూ.88 లక్షల పెట్టుబడులను ఫ్రీజ్(నిలుపుదల) చేశారు.
విశాఖకు చెందిన పిన్నింటి సుబ్రహ్మణ్య శ్రీనివాస్ దోహా లో ఉంటున్నారు. అక్కడి దోహా నేషనల్ బ్యాంకు నుంచి విశాఖలోని యాక్సిస్,హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకులకు రూ.45 లక్షలు బదిలీ చేశారు. వాటిని తన పేరిట మరియు ఆయన భార్య పేరిట మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టారు. సమాచారం అందుకున్న ఈడీ అధికారులు ఈ నెల 15న సీతమ్మధారలోని శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులతో పాటు.. మరో రూ.43 లక్షలతో మూడు ఇళ్ల స్థలాలు..చీపురువాలస,విజయనగరం జిల్లా మరియు విశాఖపట్నంలోని తాటిటూర్,గిడిజాలా గ్రామాలు దగ్గర కొనుగోలు చేసినట్టు గుర్తించారు.
ఇదిలా ఉండగా, జరిగిన ఘటన పై దర్యాప్తు జరిపి, శ్రీనివాస్ లంచం మొత్తంలో కూడబెట్టిన ఆస్తుల వివరాలను తెలుసుకొని..విచారణ అయ్యేవరకు వాటిని సీజ్ చేయవలసిందిగా ఈడీ ను కోరింది దోహాలోని ఒనైజా పోలీస్ స్టేషన్లోని పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయం.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్కు గుడ్బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్స్టాగ్రామ్లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









