శరణార్థులకు ఆహారం, వైద్య సేవల్ని అందించిన సౌదీ అరేబియా
- June 19, 2021
ఢాకా: కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ మరియు రిలీఫ్ సెంటర్ (కెఎస్ రిలీఫ్), బంగ్లాదేశ్ దేశంలోని రోహింగ్యా శరణార్థులకు ఫుడ్ బాస్కెట్లను పంపిణీ చేయడం జరిగింది. ముస్లిం వరల్డ్ లీగ్ సాయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవలే కెఎస్ రిలీఫ్, 1000 ఫుడ్ బాస్కెట్లను ఢాకా జిల్లాలోని గాజి పూర్ నగరంలో శరణార్థులకు పంపిణీ చేయడం జరిగింది. 80,000 ఫుడ్ బాస్కెట్లను 500,000 రోహింగ్యా శరణార్థులకు పంపిణీ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, కెఎస్ రిలీఫ్ క్లినిక్స్, 436 మందికి వైద్య చికిత్సలు కూడా అందించాయి జోర్డాన్ ప్రాంతంలో. ఛైల్డ్ రెస్క్యూ క్లినిక్స్ ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తున్నారు. అల్ ఖౌకా ప్రాంతంలో 2,925 మందికి మొబైల్ క్లినిక్స్ ద్వారా వైద్య సేవలు అందించారు గత వారంలో. 1.47 ల్యాబ్ పరీక్షలు నిర్వహించారు. 2,449 మందికి అవసరమైన మందులు అందించారు.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..
- లూలు మాల్కు భూకేటాయింపు రద్దు









