వ్యాక్సిన్లు తీసుకున్న ప్రవాసీయులకు అనుమతి - దుబాయ్
- June 19, 2021
దుబాయ్: భారత్ లోని డెల్టా వేరియంట్ సృష్టించిన మారణహోమానికి యావత్ ప్రపంచం అప్రమత్తమైంది. దాంతో ప్రపంచ దేశాలు భారత్ పై ట్రావెల్ బ్యాన్ ను విధించిన సంగతి తెలిసిందే. దీంతో, వివిధ కారణాల చేత తమ దేశాలకు వెళ్ళిన ఎందరో ప్రవాసీయులు అక్కడే చిక్కుపోయారు.ఎందరో తమ కష్టాలను అటు భారత ప్రభుత్వానికి, ఇటు నివసిస్తున్న దేశ ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నారు. అంతర్జాతీయ విమానాలపై జులై 6 వరకు బ్యాన్ విధించింది భారత్. గడువు పూర్తవుతుండడంతో ప్రవాసీయులలో ఆత్రుత నెలకొంది. నివాసితుల నుండి భారీగా అందుతున్న అభ్యర్థనల ఆధారంగా దుబాయ్ నేడు తాజా ప్రకటన విడుదల చేసింది.
అయితే, ఎవరైతే వ్యాక్సిన్లు తీసుకున్నారో వాళ్ళను దుబాయ్ కు అనుమతించాలంటూ దుబాయ్ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులను పూర్తిచేసుకున్న నివాసితులు మాత్రమే దుబాయ్ వచ్చేందుకు అర్హులు. ఈ మార్పులు జూన్ 23, 2021 నుండి అమల్లోకి వస్తాయి.
ప్రయాణీకులకు గమనిక:
* ప్రయాణికులందరూ బయలుదేరే ముందు 48 గంటల్లో తీసుకున్న నెగటివ్ కోవిడ్ టెస్టు ఫలితాన్ని సమర్పించాలి.
* క్యూఆర్ కోడెడ్ పిసిఆర్ పరీక్ష ఫలిత ధృవీకరణ పత్రాలు మాత్రమే అంగీకరించబడతాయి.
* విమాన ప్రయాణానికి 4 గంటల ముందు ప్రయాణీకులందరూ రాపిడ్ పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి.
* ప్రయాణీకులందరూ దుబాయ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు తప్పనిసరిగా పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి.
* ప్రయాణీకులు తమ పిసిఆర్ పరీక్ష ఫలితాన్ని (ఇది 24 గంటల్లోపు అందుతుందని అంచనా) పొందే వరకు సంస్థాగత క్వారంటైన్ కు లోనవుతారు. యూఏఈ పౌరులు మరియు దౌత్యవేత్తలకు ఈ షరతుల నుండి మినహాయింపు కలదు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







