లాక్ డౌన్ నిబంధనలను మరింత సులభతరం చేసిన కర్నటక
- June 19, 2021
బెంగుళూరు: కరోనా వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో రాష్ట్రాలు లాక్ డౌన్ క్రమంగా తీసివేస్తున్నాయి.కర్ణాటక కూడా లాక్ డౌన్ నిబంధనలను మరింత సులభతరం చేశాయి.కర్ణాటకలో కొన్ని జిల్లాల్లో లాక్ డౌన్ రూల్స్ వెసులుబాటు కల్పించారు. కొన్ని జిల్లాల్లో నిబంధనలు కొనసాగనున్నాయి.
16 జిల్లాల్లో సాయంత్రం 5 వరకు షాపులు తెరచి ఉంటాయి. ప్రజా రవాణా, బస్సులు, మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. అయితే అందులో 50 శాతం కేపాసిటీతో మాత్రం నడపాలని ప్రభుత్వం షరతు విధించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా 50 శాతం కేపాసిటీ నిబంధనను తెరపైకి తీసుకొచ్చారు.
హోటల్స్, క్లబ్, రెసార్టెంట్లు తెరచేందుకు పర్మిషన్ ఇచ్చారు. అయితే అందులో ఏసీ వేయొద్దు, మద్యం సరఫరా చేయొద్దని నిబంధన పెట్టారు. జిమ్ కూడా 50 శాతం మందితో.. ఏసీ ఆన్ చేయకుండా నడుపుకోవచ్చు. లాడ్జ్, రిసార్ట్ కూడా 50 శాతం కేపాసిటీతో రన్ చేయొచ్చు. స్టేడియాల్లో క్రీడలు నిర్వహించుకోవచ్చని.. కానీ నిబంధనలను బ్రేక్ చేయొద్దని స్పష్టంచేశారు.
నైట్ కర్ఫ్యూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉంటుందని స్పష్టంచేశారు. శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది.
తాజా వార్తలు
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు
- తెలంగాణలో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు
- తెలంగాణ: మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
- మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే ! ధీమా వ్యక్తం చేసిన జగన్
- ఢిల్లీలో 15 రోజుల్లో 807 మంది అదృశ్యం
- ఖతార్ రాజధాని దోహాలో మంత్రి నారాయణ బృందం పర్యటన
- ఖతార్ లో క్లాస్రూమ్ రీడింగ్ బ్యాగ్ ప్రాజెక్ట్..!!







