గోడౌన్లో భారీ అగ్నిప్రమాదం..ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- June 20, 2021
కువైట్: షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, మృతుని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదం చోటు చేసుకున్న గోడౌన్ ప్రాంతం 10,000 చదరపు మీటర్లు విస్తరించి ఉండటంతో మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఫోర్స్ కు చెందిన ఏడు బృందాలు శ్రమించాల్సి ఉంచింది. షువైఖ్ ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు సభాన్, సల్మియా, అర్దియా, మిన అబ్ధుల్లా ఫైర్ బృందాలు తరలొచ్చాయి. ఇదిలాఉంటే ప్రమాదానికి సంబంధించి కారణాల కనక్కుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు కువైట్ ఫైర్ ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







