చారిత్రక నిర్మాణంగా 'తాజ్ మహల్'కు 3వ స్థానం
- June 03, 2015
ప్రపంచంలోని అత్యంత గొప్ప చారిత్రక నిర్మాణాల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పాలరాతి అద్భుతం తాజ్ మహల్ మూడో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో పెరూలోని మచ్చుపిచ్చు నిలబడింది. రెండో స్థానంలో కంబోడియాలోని ఆంగ్కోర్ వాట్ దేవాలయం నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ మూడు ప్రాంతాలకు ఆయా ర్యాంకులు కేటాయించారు. పర్యాటకానికి సంబంధించిన ప్రఖ్యాత వెబ్ సైట్ ఒకటి ఈ మేరకు అభిప్రాయ సేకరణ చేసింది. ఏటా తాజ్ మహల్ అద్భుతాన్ని వీక్షించేందుకు ఇరవై నుండి నలభై లక్షల మంది వస్తారు. అందులో విదేశీ పర్యాటకులు రెండు లక్షలకు పైగా ఉంటారని తెలిపింది. తాజ్ మహల్ను మొఘల్ రాజు షాజహాన్ నిర్మించారు. అతను తన భార్య ముంతాజ్ పైన ప్రేమతో నిర్మించాడు. ఇది ఆగ్రాలో ఉంది. 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







