ఏడాది చివరినాటికి పర్మినెంట్ గా 80% రిమోట్ లిటిగేషన్ సర్వీసులు
- June 21, 2021
యూఏఈ: న్యాయవ్యవస్థలో వేగవంతమైన సేవలు అందించే లక్ష్యంతో ఈ ఏడాది చివరి నాటికి రిమోట్ లిటిగేషన్ సేవలను మరింతగా విస్తృతం చేస్తోంది. 2021 చివరి నాటికి దాదాపు 80 శాతంపైగా రిమోట్ లిటిగేషన్ సెషన్స్ నిర్వహించేలా న్యాయవ్యవస్థను తీర్చిదిద్దనున్నట్లు యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వెల్లడించారు. కోవిడ్ 19 నేపథ్యంలో ఏర్పడిన సవాళ్లను అధిగమించి రిమోట్ లిటిగేషన్ విధానాన్ని అడాప్ట్ చేసుకోవటంలో యూఏఈ విజయవంతం అయ్యిందని తెలిపారు. అదే అనుభవంతో రానున్న రోజుల్లో అత్యంత సమర్ధవంతమైన, పారదర్శకమైన, వేగవంతమైన న్యాయ సేవలు అందించేలా రిమోట్ లిటిగేషన్ సర్వీసు దోహదపడేలా సిద్ధం అవుతున్నామని వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







